దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇవ్వాలన్న జల్జీవన్ మిషన్ లక్ష్యాన్ని 2024నాటికల్లా పూర్తి చేస్తామని.. ఇందుకు అన్నిరాష్ర్టాలు, అధికారులు పూర్తి సహకారం అందించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. ఆర్నెల్లుగా పథకం రూపకల్పనలో తలమునకలయ్యామని.. ఇకనుంచి పథకం పనులను వేగవంతంచేస్తామన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఐటీసీ కాకతీయలో కేంద్ర జలశక్తిశాఖ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ర్టాల ప్రాం తీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్రమంత్రికి తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఏపీ జల వనరులశాఖ మంత్రి అనిల్కుమార్యాదవ్ స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా షెకావత్ మాట్లాడుతూ.. పథకం నిధుల కోసం నాబా ర్డు, ఇతర ఆర్థికసంస్థలను సంప్రదిస్తున్నామని తెలిపారు. బడ్జెట్కు లోబడి రాష్ర్టాలకు 50 శాతం నిధులను ఇస్తామని చెప్పారు. జల్జీవన్ మిషన్ను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అన్నిరాష్ర్టాలు ప్రధానంగా భూఉపరితల జలాల్ని అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని.. అందుబాటులో లేనిచోట మాత్రమే భూగర్భజలాలను పంపిణీ చేయాలని సూచించారు. పథకం అమలుకు సంబంధించి కేంద్రం అన్ని రాష్ర్టాలకు సహకారం అందిస్తుందన్నారు.